పెన్షన్, ఉపాధి కూలీ డబ్బులు కాజేసిన బిపిఎం నిర్బంధం......

పెన్షన్, ఉపాధి కూలీ డబ్బులు కాజేసిన బిపిఎం నిర్బంధం......

చర్యలు తీసుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్న బాధితులు........
రాజాపేట, ముద్ర: రాజాపేట మండలం నమిల గ్రామపంచాయతీ బిపిఎం తరుణ్ పంచాయతీ కార్యదర్శి సంపత్ సహకారంతో 30 మందికి పైగా పెన్షన్ దారుల ఉపాధి కూలీల డబ్బులు కాజేయడంతో ఆగ్రహించిన బాధితులు గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. ఈ విషయాన్ని సంబంధిత ఎంపీడీవో, ఉపాధి హామీ ఎపిఓ, తపాలా శాఖ  ఏ.ఎస్.పిలకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

గంటకు పైగా బిపిఎంను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించిన అనంతరం ఎంపీవో దినకర్ వచ్చి వివరాలు బాధితుల ద్వారా అడిగి తెలుసుకుని వారు ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్నారు. పెన్షన్ దారులకు చిల్లర సాకుతో పూర్తిగా డబ్బులు ఇవ్వకపోవడం ప్రతినెల లబ్ధిదారులను సతాయించడం విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం గతంలో మూడుమార్లు డబ్బులు వాడుకోగా గ్రామ పెద్దల ప్రమేయంతో బిపిఎం డబ్బులు చెల్లించినట్లు తెలిపారు బసంతాపురం గ్రామంలో కూడా బీపీఎం ఉపాధి కూలీల డబ్బులు వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామపంచాయతీ కార్యదర్శి, బిపిఎం లను సస్పెండ్ చేసి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.