జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యుత్ ఉద్యోగుల సంఘం సంబరాలు
![జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యుత్ ఉద్యోగుల సంఘం సంబరాలు](https://mudranews.in/uploads/images/2023/12/image_750x_6571d85227985.jpg)
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాలలోని కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 యూనియన్ ఆఫీస్ అవరణలో సంఘం నాయకులు కాంగ్రెస్ విజయోత్సవ సంబారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి, స్వీట్స్ పంపిణి చేశారు. నాయాకులు మాట్లాడుతూ కార్మికుల పక్షమైన ప్రభుత్వం ఏర్పడడం చాలా సంతోషమని, కార్మికుల సమస్యల పోరాటాలకు పలితం ఈ ప్రభుత్వంతో లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అయిన ఐ ఎన్ టి యు సి సెక్రెటరీ రాంజీ నాయక్, ప్రెసిడెంట్ తిరుపతి, రాజమల్లు, బాలు నాయక్, హరిప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు