విద్యార్థులకు రక్త గ్రూపు నిర్ధారణ పరీక్షలు

విద్యార్థులకు రక్త గ్రూపు నిర్ధారణ పరీక్షలు

ముద్ర,రాయికల్: రాయికల్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో గౌడ్ అఫీషియల్స్& ప్రొఫెషనల్స్ (గోప) రాయికల్ మండల శాఖ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు రక్త గ్రూపు నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గోప అధ్యక్షులు బత్తిని నిరంజన్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి తమ గ్రూపు తెలిసి ఉంటే అత్యవసర సమయంలో రక్తదానం చేసే అవకాశం ఉంటుందని అన్నారు.

విద్యార్థులకు రక్త నిర్ధారణ పరీక్షలు చేసే విధానం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీపతి రాఘవులు గోపజిల్లా ఉపాధ్యక్షులు పొన్నం రమేష్, గోప మండల శాఖ అధ్యక్షులు బత్తిని నిరంజన్, ఉపాధ్యక్షులు కైరం రమణ, ట్రెజరర్ గుగ్గిళ్ళ రాము సభ్యులు మొసరపు శ్రీధర్, మొసరపు సంతోష్ ఉపాధ్యాయులు రవీంధర్, మల్లేశం,గంగజమున,శ్రావణ్ శ్రీలత, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు