దానంపై స్పీకర్కు అనర్హత పిటిషన్ సమర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ముద్ర,హైదరాబాద్:- ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం హైదరాబాద్ హైదర్గూడలోని స్పీకర్ నివాసానికి వెళ్ళి స్పీకర్ ప్రసాద్ కుమార్ను కలిశారు .ఈ సందర్భంగా దానంపై అనర్హత పిటిషన్ను స్పీకర్కు అందచేసారు. కాగా ఆదివారం ఇదే విషయమై స్పీకర్ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నం ఫలించలేదు.