నేతాజీ నగర్ లో వైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలు

ముద్ర న్యూస్ బ్యూరో,హైదరాబాద్: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని మెహిదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ లో గల శ్రీ సీతారామ ఉమామహేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని తిలకించడానికి భారీ స్క్రీన్ ని ఏర్పాటు చేశారు. ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేషమైన ఏర్పాట్లు చేశారు. నేతాజీ నగర్ తో పాటు చుట్టుపక్కల గల శ్రీనివాస్ నగర్, జ్యోతి నగర్ మారుతి నగర్ ఓం నగర్ కు చెందిన వందలాది మంది భక్తులు బాల రాముడి ప్రతిష్ట కార్యక్రమాన్ని తిలకించి పులకించిపోయారు. అనంతరం సుమారు 1500 మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.