కొండగట్టు అంజన్నను దర్శించుకున్న 'బలగo' వేణు..

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న 'బలగo' వేణు..

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని బుధవారం సినిమా ఆర్టిస్ట్, 'బలగం' మూవీ డైరెక్టర్ వేణు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనను సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు చిరంజీవి, అర్చకులు పవన్, లక్ష్మణ్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

 అంజన్న ఆశీస్సులతో
సిరిసిల్లకు చెందిన తాను చిన్ననాటి నుంచి కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దర్శనంకు వస్తున్నట్లు, అంజన్న ఆశీస్సులతో సినిమా ఆర్టిస్ట్ గా మంచి పేరు సoపాదించుకున్నట్లు వేణు తెలిపారు. తన కేరిర్ లో తొలి చిత్రం 'బలగం' మూవీ మంచి హిట్ అందుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. చిత్రం విజయంతో అవకాశాలు పెరిగాయన్నారు.