కరెంట్ షాక్ ఇద్దరికీ తీవ్ర గాయాలు
![కరెంట్ షాక్ ఇద్దరికీ తీవ్ర గాయాలు](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_64736056bbe5b.jpg)
శంకరపట్నం, ముద్ర : కరెంట్ షాక్ తో ఇద్దరికీ గాయాలైన ఘటన శంకరపట్నం మండలం అంబాలపూరు లో చోటుచేసుకుంది. కామెరా నారాయణ రేకుల షెడ్డు వేస్తుండగా రామగిరి శ్రీనివాస్, నేరెళ్ల సాయికుమార్ ఇద్దరూ కలిసి రేకుల షెడ్డు వేస్తుండగా 11 కెవి వైరు తగలడంతో ఇద్దరికీ షాక్ రావడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 ఫోన్ చేసి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి పైలెట్ గోపికృష్ణలు, క్షతగాత్రులకు ప్రధమ చికిత్స అందించారు.