అలకానందనదిలో పడిన బస్సు..12 మంది దుర్మరణం

అలకానందనదిలో పడిన బస్సు..12 మంది దుర్మరణం

Bus fell in to river: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన ఘోర ప్రమాదంలో సుమారు 12 మంది యాత్రికులు మృత్యువాత పడ్డారు. రుద్రప్రయాగ్​లోని బద్రీనాథ్​ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 12మంది చనిపోగా, అనేక మందికి గాయపడ్డారు. ఈ ఘటనను జిల్లా ఎస్​పీ డాక్టర్ విశాఖ అశోక్​ ధ్రువీకరించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్యేక బలగాలు, స్థానిక పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు.