నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్

నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్
  • ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రతీ ఒక్కరూ అండగా నిలవాలి..
  • 71 మంది లబ్ధిదారులకు 50 లక్షల 50 వేల రూపాయల విలువ గల చెక్కులను అందజేసిన మంత్రి సత్యవతిరాథోడ్..

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్ అన్నారు.  మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని  మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు మంత్రి సత్యవతిరాథోడ్ మంగళవారం అందజేశారు.  ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్  మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఎంతోమందికి మేలు జరిగిందన్నారు. చాలా మంది అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న వారందరికి ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం చేసి అండగా ఉన్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో పాలకులు ఏ రోజు కూడా తెలంగాణ పేదల సంక్షేమం కోసం ఆలోచన చేయలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాతే గౌరవ సీఎం కేసీఆర్ పేదల బతుకులు మార్చాలన్న ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారనీ అన్నారు.

భవిష్యత్తు తరాల బాగుకోసం ఆడబిడ్డలందరూ  కేసీఆర్ ను ఆశీర్వదించాలని వారికి అండగా నిలవాలని మంత్రి కోరారు. తెలంగాణ రాకముందు రైతులు సాగునీటి కోసం ఎరువుల కోసం కరెంటు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు. అందరి  సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల వారీగా అన్ని కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న గౌరవ సీఎం కేసీఆర్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు  జెడ్పీ చైర్ పర్సన్  అంగోత్ బిందు, కురవి జెడ్పిటిసి బండి వెంకట్ రెడ్డి, బయ్యారం పిఎసిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్రనాయకులు నూకల శ్రీరంగారెడ్డి‌, సీనియర్ నాయకులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, కొమ్మినేని రవీందర్,  బిక్షంరెడ్డి, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి,బొడా శ్రీను తదితరులు పాల్గొన్నారు.