భువనగిరికి విచ్చేసిన సిడబ్ల్యుసి సభ్యులు మాలవ్య కి స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

భువనగిరికి విచ్చేసిన సిడబ్ల్యుసి సభ్యులు మాలవ్య కి స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

 భువనగిరి సెప్టెంబర్ 20 (ముద్ర న్యూస్) ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వెళ్తూ భువనగిరిలో ఆగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు, రాజస్థాన్ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి మహీంద్రజీత్ సింగ్ మాలవ్య కి భువనగిరి పట్టణ శివారులోని బైపాస్ వద్ద గల వివేరా హోటల్ వద్ద పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్,యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్, యువజన కాంగ్రెస్ భువనగిరి అసెంబ్లీ ఉపాధ్యక్షులు కొల్లూరి రాజు, ఎన్ ఎస్ యు ఐ భువనగిరి అసెంబ్లీ అధ్యక్షులు బొల్లేపల్లి వినయ్ తదితరులు స్వాగతం పలికి సన్మానించడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన గ్యారెంటీ పథకాలపై రాబోవు అసెంబ్లీ ఎన్నికలపై భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలాబలాలపై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మరియు వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహేంద్ర జీత్ సింగ్ మాలవ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన గ్యారెంటీ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేయబోవు కార్యక్రమాలపై పూర్తి అవగాహన కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నాయకులు కార్యకర్తలు అంతా సమన్వయంతో పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.