కెసిఆర్ బహిరంగ సభ విజయవంతం కోసం విస్తృత ప్రచారం చేపట్టిన నాయకులు.....

కెసిఆర్ బహిరంగ సభ విజయవంతం కోసం విస్తృత ప్రచారం చేపట్టిన నాయకులు.....

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం నాడు ఆలేరు శాసనసభకు బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొంగిడి సునీత మహేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహిస్తున్న ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్న సందర్భంగా ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించేందుకు మున్సిపల్ కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణులు వార్డు కమిటీలను. ఇంకార్జీలను నియమించారు. ఈ సందర్భంగా ఎనిమిదవ వార్డ్ ఇంచార్జి కోలుపుల హరినాథ్ ఆధ్వర్యంలో శనివారం నాడు వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ న జన సమీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ దాసి నాగలక్ష్మి సంతోష్. వార్డు అధ్యక్షులు నారాయణ సిద్ధులు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశికంటి శ్రీనివాస్. నాయకులు చింతకింది సిద్ధులు. ఏలూరు భానుమతి. చిట్టిమిల్ల కమలమ్మ తో పాటు కాలనీవాసులు. పార్టీ శ్రేణులు. పెద్ద ఎత్తున పాల్గొన్నారు.