త్వరలో స్టీల్ బ్రిడ్జి ప్రారంభం కమిషనర్ రోనాల్డ్ రోస్

త్వరలో స్టీల్ బ్రిడ్జి ప్రారంభం కమిషనర్ రోనాల్డ్ రోస్

ముషీరాబాద్, ముద్ర: ఇందిరా పార్క్ నుండి వి.ఎస్.టి వరకు రూ.450 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఫ్లై ఓవర్ స్టీల్ బ్రిడ్జి ని త్వరలో అందుబాటులోకి తెస్తామని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. సోమవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఫ్లైఓవర్ స్టీల్ బ్రిడ్జి ని పరిశీలించారు. స్టీల్ బ్రిడ్జిని త్వరలో ప్రారంభించి అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు.