వ్యక్తి ఆత్మహత్య
![వ్యక్తి ఆత్మహత్య](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64a19ae3a9a31.jpg)
ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: పురుగుల మందు తాగి తాళ్లపల్లి సుధాకర్(40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా ఘన్ పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం జరిగింది. వివరాలు... రాయపర్తి మండలం తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన తాళ్లపల్లి సుధాకర్ స్టేషన్ ఘన్ పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. మృతికి ఆర్థిక ఇబ్బందులు కారణమై ఉండొచ్చని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.