పిల్లలతో సహా తల్లిదండ్రులు ఆత్మహత్య 

పిల్లలతో సహా తల్లిదండ్రులు ఆత్మహత్య 

కుషాయిగూడ : అనారోగ్య సమస్యలు... పిల్లల బుద్ధిమాంద్యాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు... పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం...  గాదె సతీష్ (39), అతని భార్య గాదే వేద(35), కుమారులు   గాదే నిషికేత్ (9),   గాదె నిహాల్ (5) లతో కలసి కందిగూడ లోని క్రాంతి పార్క్ రాయల్ అపార్ట్మెంట్లో బి 107 ఫ్లాట్లో నివసిస్తున్నారు. గాదె సతీష్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా అతని భార్య గృహిణి. ఇక పెద్ద కుమారుడు స్థానికంగా ఉన్న భవిన్స్ లో నాలుగో తరగతి చదువుతుండగా, చిన్న కుమారుడు... ఆర్టిజన్ స్కూల్లో చదువుతున్నాడు.

ఈ క్రమంలో  బుద్ధిమాంద్యు లైన కుమారుల ఆరోగ్య సమస్యలను.. తట్టుకోలేని భార్యాభర్తలు పిల్లలతో సహా శనివారం మధ్యాహ్నం తమ ప్లాట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.