టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీని ప్రశ్నిస్తున్న ఈడీ
![టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీని ప్రశ్నిస్తున్న ఈడీ](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6426b54416562.jpg)
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం జరిగింది. టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీని ప్రశ్నిస్తున్న ఈడీ. ఈడీ ఆఫీసుకు వెళ్ళిన జనార్ధన్ రెడ్డి, అనితా రామచంద్రన్. ఇద్దరి స్టేట్మెంట్ నమోదు చేస్తున్న ఈడీ అధికారులు. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు సాగుతోంది. మొత్తం రూ. 31 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన సిట్. ఈ 31 లక్షలతో పాటు విదేశాల నుంచి కూడా డబ్బు వచ్చిందనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.