రెప్పపాటులో చోరీ..

రెప్పపాటులో చోరీ..
  • పార్కింగ్ చేసిన కారులో నుంచి రూ.ఐదు లక్షలు కొట్టేసిన దొంగలు
  • నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో ఘటన

ముద్ర, తెలంగాణ బ్యూరో : నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో పట్టు పగలే దొంగలు రెచ్చిపోయారు. దామరచర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అజ్మీర మాలు ఓ ఇంటి స్థలం విక్రయానికి సంబంధించి మిర్యాలగూడ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పని పూర్తి చేసుకొన్నాడు. అక్కడి నుంచి తన మిత్రులతో కలిసి రూ.ఐదు లక్షలను  కారులో పెట్టి భోజనం కోసం ఓ రెస్టారెంట్ ముందు కారు పార్కింగ్ చేశారు. వారిని అనుసరిస్తూ బైక్ మీద వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రెప్పపాటులో కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న క్యాష్ బ్యాగుతో పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు వాడపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇది తెలిసిన వ్యక్తులే చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.