న్యాయవాదుల సమస్యల సాధన కోసం కృషి చేయాలి

న్యాయవాదుల సమస్యల సాధన కోసం కృషి చేయాలి
  • ఐలు ఆల్ ఇండియా కార్యదర్శి సురేంద్రనాథ్ పిలుపు
  •  ఆలిండియా లాయర్స్ యూనియన్ ఐలు

ముద్ర ప్రథినిది, భువనగిరి: తెలంగాణరాష్ట్ర నూతన కమిటీని ఆల్ ఇండియా కార్యదర్శి సురేంద్రనాథ్ ప్రకటించారు గౌరవ అధ్యక్షులుగా విద్యాసాగర్ , అధ్యక్షులుగా కొల్లి సత్యనారాయణ , ప్రధాన కార్యదర్శిగా కే పార్థసారథి , కోశాధికారిగా ఈ వేణుగోపాల్ రావు, ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ ఆజాద్ రంగారెడ్డి, వనగంటి నాగేశ్వరరావు వనపర్తి, సిహెచ్ శైల పెద్దపల్లి, శ్రీనివాసరావు ఖమ్మం, సహాయ కార్యదర్శిగా పి రామచంద్రారెడ్డి హైదరాబాద్, ఎం శ్రీనివాసరావు ఖమ్మం, పి కిషన్ భద్రాద్రి కొత్తగూడెం, ఎండి ఇస్మైల్ అహ్మద్ భువనగిరి, మోత్కూరు వనజ వనజా, కమిటి లోనికి భువనగిరి నుంచి కమిటి సభ్యులు గా ప్రత్యేక ఆహ్వనితులు నాగారం అంజయ్య, కమిటి సభ్యులుగా మామిడి వెంకట్ రెడ్డి   ఎన్నుకున్నారు.రాష్ట్రంలో ఉన్న న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేసి సమస్య సాధించే దిశగా పోరాటాలు నిర్వహించాలని ఆయన కొత్త కమిటీని కోరారు. 

ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా చట్టాలను ఇక్కడ సాధించుకునే దిశగా తమ యొక్క కార్యచరణ ఉండాలని ఆ విధంగా కమిటీ పని చేస్తుందని ఆయన అన్నారు. ఈ మహాసభలలో చేసిన తీర్మానాలు రాష్ట్రంలో అడ్వకేట్ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు 10,000  స్టైఫండ్ ఇవ్వాలని, డెత్ బెనిఫిట్ ఆ నాలుగు లక్షల నుంచి పది లక్షల పెంచాలని, 41 ఏ సి ఆర్ పి సి దుర్వినియోగాన్ని అరికట్టాలని,  నూతనంగా ఏర్పడిన జిల్లా కోర్టు లలో మౌనిక సదుపాయాలు కల్పించాలని,లా అకాడమీ ఏర్పాటు చేయాలని, చేసిన  తీర్మానాలు  అమలు దిశగా కమిటీ కార్యచరణ రూపొందించుకొని విజయం సాధించాలని ఆయన కోరారు.