కూలిన యుద్ద విమానం.. పైలట్ & కో-పైలట్ సురక్షితం

ముద్ర, ఢిల్లీ: మహారాష్ట్రలోని నాసిక్‌లో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం కూలిపోయింది. ఘటనకు ముందు పైలట్ & కో-పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. పెద్ద శబ్ధంతో పొలాల్లో కూలిపోయిన విమాన శబ్ధం విన్న స్థానిక జనం భయభ్రాంతులకు లోనయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, విషయాన్ని గ్రహించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.