ఫింగర్ ప్రింట్ ఎస్సైకి సీఐ గా పదోన్నతి..

ఫింగర్ ప్రింట్ ఎస్సైకి సీఐ గా పదోన్నతి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖలో ఫింగర్ ప్రింట్ ఎస్సైగా పనిచేస్తున్న అరెల్లి రాజకుమార్ సీఐగా పదోన్నతి పొందారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఎస్పీ జె. సురేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రమోషన్ అనేది ప్రతి ఒక్క ఉద్యోగి జీవితంలో ఒక మైలురాయి లాంటిదని, మరింత బాధ్యతగా విధులు నిర్వర్తిoచాలని అలాగే నేరాలను శోధించి, చేధించాలని, సమర్థవంతంగా పనిచేయాలని చెప్పారు.