శ్రీ శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

శ్రీ శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
  • రామేశ్వరంలో శివలింగానికి ప్రత్యేక పూజలు

ముద్ర షాద్ నగర్: మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామేశ్వరం లో శ్రీ శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవం షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేవాలయంలో శివలింగానికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి తదితరులను ఆశీర్వదించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు విజయ్ కుమార్ రెడ్డి, చక్రం రెడ్డి, మోహన్ రెడ్డి, చారి తదితరులు పాల్గొన్నారు..