మెదక్ లో పర్యటించిన హర్యానా బిజెపి నేత డగ్లా 

మెదక్ లో పర్యటించిన హర్యానా బిజెపి నేత డగ్లా 

ముద్ర ప్రతినిధి, మెదక్:  మెదక్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్, హరియాన రాష్ట్ర మహిళ మోర్చా ఇంచార్జ్ నందాడగ్లా ఆదివారం పర్యటించారు. ఈ సందర్బంగా మహిళా కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు.  భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో  మహిళల కోసం 80 పథకాలు అమలుపరుస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు  రాష్ట్రంలో అట్టడుగు ప్రజలకు అందకుండా నిర్వీర్య పరుస్తున్న బిఆర్ఎస్ పై ధ్వజామెత్తారు. కేసీఆర్ వైఫల్యాల గురించి మహిళా కార్యకర్తలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు  బెండే వీణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, నల్లాల విజయ్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ ఎక్కల దేవి మధు,  పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్,  మహిళా మోర్చా  పట్టణ అధ్యక్షురాలు సంగీత, శక్తి కేంద్ర ఇంచార్జ్ బక్కవారి శివ,  సహించార్జ్ గోపి, ఎంఎల్ఎన్ రెడ్డి, శీను,  మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.