పార్లమెంట్ భవనం వద్ద హైటెన్షన్... ముగ్గురు అనుమానితుల అరెస్ట్

పార్లమెంట్ భవనం వద్ద హైటెన్షన్... ముగ్గురు అనుమానితుల అరెస్ట్

New Delhi: న్యూఢిల్లీలోని పార్లమెంటు వద్ద శుక్రవారం ఉదయం హైటెన్షన్ వాతావరణం నెలకొది. ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంటులోకి చొరబడేందుకు ప్రయత్నించగా, వారిని అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు. ఈ ముగ్గురినీ ఖాసిం, మోనిస్, షోయబ్ గా గుర్తించారు. పార్లమెంట్ లోని గేట్ నెంబర్ 3 నుంచి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన ముగ్గుర్నీ భద్రతా సిబ్బంది నిలువరించారు. అక్కడికి వారు ఎందుకు వచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదైనా ఉగ్రవాద సంస్థ కుట్రలో భాగంగా వీరు చొరబడ్డారా అనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఆ కోణంలోనూ విచారణ సాగిస్తున్నట్టు తెలుస్తోంది.