కంటి వెలుగు ప్రారంభించిన ఐ డి సి చైర్మన్ వేణుగోపాలాచారి
![కంటి వెలుగు ప్రారంభించిన ఐ డి సి చైర్మన్ వేణుగోపాలాచారి](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63f4af3b45bb0.jpg)
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో కంటివెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్. వేణుగోపాలాచారి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు చూపును అందజేయాలనే సదాశయంతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎడిపెల్లి నరేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.