మల్టీ జోన్ పోలీస్ ఐజి కి ఘనస్వాగతం
![మల్టీ జోన్ పోలీస్ ఐజి కి ఘనస్వాగతం](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63f4b0d115936.jpg)
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రానికి తొలిసారిగా వచ్చిన మల్టీజోన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డికి మంగళవారం పోలీసులు ఘనస్వాగతం పలికారు. స్థానిక పోలీస్ గెస్ట్ హౌస్ లో ఆర్ఎస్ఐ సాయికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గౌరవ వందనాన్ని అందజేశారు. ఎస్పీ ప్రవీణ్ కుమార్ సహా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థలో కూడా మార్పులు చేపట్టాలని సూచించారు.