విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

గుండాల జనవరి 29 (ముద్ర న్యూస్)
మండలంలోని మాసాన్ పల్లి గ్రామంలో గ్రామ సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రక్క నుండి నడుచుకుంటూ,వెళుతున్న అదే గ్రామానికి చెందిన  ఓర్సు మైసయ్య 50 సంవత్సరాలు ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగిలి అక్కడే మృతి చెందారు,మృతునికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు.

భార్య మైసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సంఘటన స్థలానికి ఎస్సై యాకన్న విద్యుత్ శాఖ ఏఈ ఆర్ఐ వెంకటేశ్వర్లు సందర్శించి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ఏరియా హాస్పిటల్ శవాన్ని తరలించారు ప్రమాదవశాత్తు మరణించిన మైసయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ ఏలూరు రామ్ రెడ్డి  కోరారు.