రైతుబంధు ఆపాలంటూ ఎన్నికల కమీషన్ ఆదేశాల పై  స్పందించిన మంత్రి  జగదీష్ రెడ్డి 

రైతుబంధు ఆపాలంటూ ఎన్నికల కమీషన్ ఆదేశాల పై  స్పందించిన మంత్రి  జగదీష్ రెడ్డి 
  • రైతుబంధు విషయంలో ఎన్నికల కమీషన్ ఆదేశాలు దురదృష్టకరం
  • ఆనాడు కుట్రపూరితంగా కాంగ్రెస్ ఆపితే నేడు ఎన్నికల కమీషన్ రూపంలో ఆటంకం
  • రైతుబంధు ఆపిన కాంగ్రెస్ ను ఖతం చేయాలి
  • ఎవరెన్ని కుట్రలు చేసినా ఆపగలిగేది ఈ నాలుగు రోజులే 
  • రైతులకు ఎలాంటి బెంగ అవసరంలేదు , తాత్కాలిక ఆటంకాలతో అధైర్యపడొద్దు
  • ఎన్నికల తరువాత యధావిధిగా రైతు బంధు చేరుతుంది
  • మళ్ళీ కేసిఆరే హ్యాట్రిక్ ముఖ్యమంత్రి
  • కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉండగా రైతుబంధు 24 గంటల కరెంటు రైతు బీమా ఆగదు
  •  ఏ ఒక్క సంక్షేమ పథకం ఆపేవాడు ఎవడు లేదు
  • ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు
  • నల్లగొండ జిల్లా లో 12 కు 12 స్థానాలలో బిఆర్ఎస్ విజయం ఖాయం 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-రైతుబంధు ఆపిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఖతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బిఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. రైతుబంధు పంపిణి నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి,రైతుబంధు విషయంలో ఎన్నికల కమీషన్ ఆదేశాలుదురదృష్టకరంఅన్నారు.ఆ నాడు కుట్రపూరితంగా కాంగ్రెస్ ఆపితే నేడు ఎన్నికల కమీషన్ రూపంలో ఆటంకం కలిగింది అన్నారు.ఎవరెన్ని కుట్రలు చేసినా ఆపగలిగేది ఈ నాలుగు రోజులే ఆన్న మంత్రి,రైతులకు ఎలాంటి బెంగ అవసరంలేదన్నారు.తాత్కాలిక ఆటంకాలతో అధైర్యపడొద్దు అన్నారు.ఎన్నికల తరువాత యధావిధిగా రైతు బంధు చేరుతుంది అన్నారు.మళ్ళీ కేసిఆరే హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు.కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉండగాకేసీఆర్ కంఠంలో ప్రాణం ఉండగా రైతుబంధు ,24 గంటల కరెంటు, రైతు బీమా తో పాటు ఏ ఒక్క సంక్షేమ పథకం ఆపేవాడు ఎవడు లేరాన్నారు.ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవొద్దన్నారు..సూర్యాపేటలో 12 స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్న మంత్రి, ప్రజల నుంచి వస్తున్న స్పందన అపూర్వమన్నారు. గ్రామాలకు ప్రచారంలోకి వెళ్తున్న సందర్భంగా అభ్యర్థులుగా గుర్తించకుండా, ప్రజలు వినతులు , విజ్ఞాపనలతో తమను అక్కున చేర్చుకుంటున్నారని తెలిపారు.