28వ వార్డును పర్యటించిన మున్సిపల్ చైర్మన్

28వ వార్డును పర్యటించిన మున్సిపల్ చైర్మన్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: ఈరోజు సోమవారం ఉదయం గద్వాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డును మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్, పర్యటించి వార్డుల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీ త్రాగునీరు విద్యుత్ సమస్యలు. తదితర సమస్యల గురించి కాలనీ వాసులను ప్రత్యేకంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా 

చైర్మన్ కేశవ్ మాట్లాడుతూ...

వార్డులలో సీసీ రోడ్డులు డ్రైనేజీ తాగునీరు విద్యుత్ స్తంభాల మర్మతులు తదితర సమస్యలపై మరియు పైపు లైన్ కొరకు తవ్విన గుంతలు వున్న వెంటనే పూడ్చివేయాలన్నారు. డ్రైనేజీల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని మర్మతులు చేయడం మురుగు కాలువలు,చెత్త చెదారం ఎప్పటికి అప్పుడు ఎక్కడ లేకుండా వార్డ్ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జవాన్లకు ఆదేశించడం జరిగింది.

మీకు ఎలాంటి సమస్యలు వున్న మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కరిస్తామని వార్డ్ ప్రజలకు చైర్మన్ కేశవ్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో :- మున్సిపల్ అధికారులు డి.ఇ ఏ.ఇ లైన్మెన్ శ్రీనివాసులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.