పది మంది మహిళలకు నాచ్చియార్ వుమెన్ ఎక్సెలెన్సీ అవార్డులు

పది మంది మహిళలకు నాచ్చియార్ వుమెన్ ఎక్సెలెన్సీ అవార్డులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభను ప్రదర్శించిన పది మంది మహిళలకు '' నాచ్చియార్ వుమెన్ ఎక్సెలెన్సీ '' విశిష్ట పురస్కారాలతో సత్కరించబోతున్నట్లు శ్రీమానుజ సేవా ట్రస్ట్ ప్రకటించింది. ఈనెల 24న హైదరాబాద్ బంజారాహిల్స్ లో నిర్వహించే ఈ పురస్కారాల ప్రధానోత్సవ  కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొంటారని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ధనుంజయ్ తెలిపారు. ఈ ఏడాది డాక్టర్ టికే చూడామణి, ఉమా సుధీర్, డాక్టర్ పాలుట్ల భారతి, డాక్టర్ ఎస్. అపర్ణ, డాక్టర్ ఎన్. అనంత లక్ష్మీ, డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ కండ్లకుంట కమల, డాక్టర్ వై. రమాప్రభ, ఎస్. జయలక్ష్మీ, డాక్టర్ పి. రామలక్ష్మీలకు ఈ పురస్కారాలను అందజేస్తామని ఆయన వెల్లడించారు.