రక్తపు మడుగులో వధూవరులు

రక్తపు మడుగులో వధూవరులు
Newly-Weds Found Dead

పెళ్లి తంతు పూర్తి కాకుండానే మృతి

రాయపూర్: కొత్తగా పెళ్లయిన వధూవరులు వివాహ క్రతువు పూర్తికాకుండానే అనుమానాస్పద స్థితిలో మరణించారు. చత్తీస్ గడ్ రాజధాని రాయపూర్ లో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అస్లాం, కక్ష భానో అనే జంటకు ఆదివారం నాడు పెళ్లయింది. మంగళవారం నాడు రిసెప్షన్ జరగాల్సి ఉంది. ఒక గదిలో వారిద్దరూ రెడీ అవుతుండగా అకస్మాత్తుగా భానో ఆర్తనాదాలు వినిపించాయి.

కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లి చూసేసరికి వధూవరులు ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్న దృశ్యం కనిపించింది. బహుశా వారిద్దరి మధ్య ఘర్షణ జరిగి ఉంటుందని, అస్లాం కత్తితో భానోను పొడిచి చంపి తాను పొడుచుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. ఈ సంఘటన పెళ్లి ఇంట్లో విషాదాన్ని నింపింది.