హైకోర్టు మాజీ జడ్జిపై సిబిఐ కేసు
![హైకోర్టు మాజీ జడ్జిపై సిబిఐ కేసు](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63f633b2be9e1.jpg)
అలహాబాద్: అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ ఎన్ శుక్లా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణపై కేంద్ర నేర పరిశోధక శాఖ సిబీఐ కేసు నమోదు చేసింది. 2014 నుంచి 2019 వరకు న్యాయమూర్తిగా పనిచేసిన శుక్లా మీద అవినీతి ఆరోపణలపై కేసు నమోదు కావడం ఇది రెండవసారి. ఒక కేసులో వైద్య కళాశాలకు అనుకూలంగా ఉత్తర్వులు ఇప్పించారన్న అభియోగంపై గతంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు.