మంథని మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ఒకరికి తీవ్ర గాయాలు
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: మంథని మండలం నాగెపెల్లి గ్రామ శివారులో శనివారం మంథని-కాటారం ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రహదారిపై ఉన్న కల్వర్టును ఢీ కొనడంతో వ్యక్తి మృతి చెందాడు. మంథని ఎస్ఐ వెంకటకృష్ణ కథనం ప్రకారం ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు నాగెపల్లి సమీపంలో ఉన్న కల్వర్టును ఢీకొని గద్దల సమ్మయ్య (34) కాటారం మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన అతను మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. గాయపడ్డ వ్యక్తి దావకానికి తరలించి చికిత్స అందిస్తున్నామని ఎస్సై తెలిపారు.