వెంకటపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మంథని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు
ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: మంథని మండల వెంకటాపూర్ లో గురువారం టిఆర్ఎస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదాలతో మంథని నియోజకవర్గంలో కారు ప్రపంజనం కొనసాగుతుందని, ఈ ఎన్నికల్లో తాను రెండోసారి ఎమ్మెల్యేగా, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నమన్నారు. మంథని నియోజకవర్గం లోని ప్రజలు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొవాలని ఆయన కోరారు.