యూనివర్సల్ హాస్పిటల్ లో పూజా మహోత్సవాలు
![యూనివర్సల్ హాస్పిటల్ లో పూజా మహోత్సవాలు](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_63ff6ded64cab.jpg)
ముద్ర, కుషాయిగూడ: ఏ ఎస్ రావు నగర్ డివిజన్ టీఎస్ఐఐసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన యూనివర్సల్ హాస్పిటల్లో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవాల్లో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు పాల్గొన్నారు. వైద్యులు వేములపల్లి శ్వేత జాహ్నవి, వేములపల్లి వరుణ్ దంపతులకు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ శ్రీనివాస కళ్యాణ ప్రతిమను అందజేశారు.
త్వరలో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆస్పత్రి యాజమాన్యం ప్రతినిధి తల్లూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వి ఎం ఎల్ ప్రసాద్, టిజికే మూర్తి, వెట్ ఇండియా సాంబశివరావు, మన్నె సుబ్రహ్మణ్యం, రామకృష్ణారావు, రామచంద్రరావు , కిషోర్ కుమార్, సుబ్బారావు , రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు