కవిత జన్మదినం సందర్భంగా పలు ఆలయాల్లో పూజలు...

కవిత జన్మదినం సందర్భంగా పలు ఆలయాల్లో పూజలు...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జన్మదినం పురస్కరించుకొని జగిత్యాలలో టిఆర్ఎస్ శ్రేణులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కేకులు కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో జగిత్యాల మండలం పొలాస పౌలస్తేశ్వరా  స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. అలాగే జగిత్యాల పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ గోలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. 36 వార్డులో కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు.

పట్టణ కౌన్సిలర్ ఆధ్వర్యంలో మిషిన్ కాంపౌండ్ లో కేక్ కట్ చేసి అనంతరం 25 మంది నిరుపేదలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డా.గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ కౌన్సిల్ సభ్యులు సమిండ్ల వాణి శ్రీనివాస్, బద్దం లతా జగన్, అడ్వాల జ్యోతి లక్ష్మణ్, పంబాల రాము, తోట మల్లికార్జున్, కప్పల శ్రీకాంత్, ముస్కు నారాయణరెడ్డి, రాజ్ కుమార్,గంగ మల్లు నవీన్,రేణుక మొగిలి,సింగం పద్మ సింగరావు,ప్రేమలత సత్యం,గంగ సాగర్,లావణ్య ప్రవీణ్,పట్టణ ఉపాధ్యక్షులు ఆనంద్,దుమాల రాజకూమర్, భిక్షు,సారయ్య, జెడ్పిటిసి మహేష్ , ఎంపీపీ ములసపు లక్ష్మి, ప్యాక్స్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, సర్పంచులు చెరుకు జాను ,గంగాధర్, ఆలయ చైర్మన్ కొండలరావు తదితరులు పాల్గొన్నారు.