భువనగిరిలో ప్రియాంక గాంధీ కార్నర్ మీటింగ్

భువనగిరిలో ప్రియాంక గాంధీ కార్నర్ మీటింగ్

అనిల్ కుమార్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వండి..

ముద్ర ప్రతినిధి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి విజయ సంకల్ప సభకి ప్రియాంక గాంధీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమెకు స్థానిక ప్రజా ప్రతినిధులు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం వినాయక చౌరస్తా వద్దకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్ని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి పాలనతో ప్రజల జీవితాలు చితికిపోతున్నాయని , భూ దందాలు , లిక్కర్ మాఫియాతో ప్రజాప్రతినిధులు వేల కోట్లు సంపాదిస్తూ విలాసవంతమైన జీవితాలు గడుపుతూ పాలనని గాలికి కొదిలేసారన్నారు. దొరల తెలంగాణ కాకుండా ప్రజల తెలంగాణ కావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందన్నారు.

బీఆర్ఎస్ , బీజేపీ పార్టీలు రెండు ఒకటేనని వాళ్లకి తోడుగా ఎంఐఎం కూడా జతకట్టిందన్నారని మండిపడ్డారు. పోరాటాల తెలంగాణ గడ్డలో ప్రజలు చైతన్యవంతులని వారు ఎప్పడూ తమ ఓట్లని అమ్ముకోరని గుర్తు చేశారు. మరోసారి బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తే అవినీతి ఆకాశాన్ని తాకుంతుందని తెలియజేశారు. అనునిత్యం ప్రజల మధ్య ఉండి వాళ్ళ కష్టసుఖాల్లో తోడు ఉండే ప్రజా నాయకుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడి , కర్ణాటక ఓబిసి నాగేశ్వరరావు , మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు , ఆలేరు మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్ , కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి , టిపిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ , రవికుమార్ , మాజీ మున్సిపల్ చైర్మన్లు దోనకొండ వనిత రాములు , బర్రె జహంగీర్ , ఎంపీపీ నరాల నిర్మల , రాష్ట్ర సేవాదళ్ నాయకులు పిట్టల బాలరాజ్ , ఎస్కే వాజీద్ , సామల రవీందర్ , మహ్మద్ రఫీ ఉద్దీన్ , కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ , పట్టణ అధ్యక్షురాలు శ్రీలత , పావని , ఇస్రాత్ భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వివిధ గ్రామాల ప్రజలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.