జేపిఎస్ లకు సంఘిబావం తెలిపిన ప్రోపేసర్ కోందండరామ్ 

జేపిఎస్ లకు సంఘిబావం తెలిపిన ప్రోపేసర్ కోందండరామ్ 

వరంగల్లో ఆత్మహత్య చేసుకున్న జేపిఎస్ సోనికి కొవ్వత్తుల నివాళి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  జూనియర్ పంచాయతి కార్యదర్శులను క్రమబద్ధికరించాలని వారు చేస్తున్న సమ్మె 16వ రోజుకి చేరింది. జగిత్యాల జిల్లా కేద్రంలోని కలెక్టరేట్ ఎదుట దీక్షా చేపట్టిన జూనియర్ పంచాయతి కార్యదర్శుల దీక్షా శిబిరాన్ని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రోపేసర్ కోదండరామ్ సందర్శించి వారికీ సంఘిబావం తెలిపారు. ఈ సందర్బగా కోదండ రామ్ మాట్లాడుతూ జేపిఎస్ ల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని, సమ్మె అనేది వారి హక్కు అని, ప్రభుత్వం వారిని భయబ్రాంతులకు గురి చేయడం సరికాదు అన్నారు.  

అలాగే బిజేపి నాయకుడు రవీందర్ రెడ్డి అధ్వర్యంలో బిజేపి నాయకులు దీక్ష శిబిరంలో కూర్చొని మద్దతు తెలిపారు.  సాయంత్రం జిల్లా జూనియర్ పంచాయతి కార్యదర్శుల సంఘం అధ్వర్యంలో వరంగల్ లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన జూనియర్ పంచాయతి కార్యదర్శి సోనికి కోవోత్తుల నివాళులు అర్పించారు. జేపిఎస్ లు దీక్షా శిబిరం నుంచి కొవ్వొత్తులతో కలెక్టరేట్ గెట్ వరకు ర్యాలీగా తరలివచ్చి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ పంచాయతి కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొమురయ్య, మండల అధ్యక్షడు రాజిరెడ్డి, నదీం , నాగరాజు,కిరీటి , సంతోష్,రాజారెడ్డి  , బీజేపి నాయకులు లింగంపెట శ్రీనివాస్, కౌన్సిలర్ గుర్రం రాము,ఆంకర్ సుధాకర్, తదితరులు పాల్గోన్నారు