సీఎం చిత్ర పటానికి ఆర్టీసి కార్మికుల క్షీరాభిషేకం

సీఎం చిత్ర పటానికి ఆర్టీసి కార్మికుల క్షీరాభిషేకం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఆర్టీసి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసినందుకు నిర్మల్ డిపో ఎదుట ఆర్టీసి సిబ్బంది మంగళవారం సంబరాలు జరిపారు. బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.