ధరణి అభ్యర్థనలను పూర్తి స్థాయిలో పరిశీలించండి

ధరణి అభ్యర్థనలను పూర్తి స్థాయిలో పరిశీలించండి

జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భూములకు సంబంధించి టీ ఎం 33 మాడ్యూల్ లో వచ్చే దరఖాస్తులను  సరైన విధంగా పరిశీలించాక మాత్రమే అందజేయాలని జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ లో బుధవారం కలెక్టర్ సమావేశం మందిరంలో 
ధరణి వెబ్సైట్ లోని టీఎం 33 మాడ్యుల్స్ పైన వివిధ మండలాల తాసిల్దార్లతో  జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎం 33 లో వచ్చే దరఖాస్తులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి  సరైన ఫార్మాట్ లో వివరాలు పొందుపరచాలన్నారు. ముందుగా ఆర్డిఓ  వద్ద తనిఖీ చేసిన తర్వాతనే కలెక్టర్ కార్యాలయానికి పంపాలని సూచించారు. మండలాల వారీగా ధరణి లో పెండింగ్ వివరాలను  అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, నిర్మల్, బైంసా ఆర్డీవోలు స్రవంతి, రవికుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.