ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

గుండాల ఏప్రిల్ 04 (ముద్ర న్యూస్): మండల సమైక్య ఐకెపి ఆధ్వర్యంలో,వరి ధాన్యం కొనుగోలు కేంద్రముల ను తాహాసిల్దార్ జలకుమారి ఎంపీడీవో దేవిక లు అంబాల నూనెగూడెం కొమ్మాయిపల్లి వెల్మజాల బండ కొత్తపెళ్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారం బించి మాట్లాడుతూ ఈ సీజన్లో వరి ధాన్య కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందడానికి రైతులు తాలు మట్టి లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని అన్నారు కార్యక్రమం లో,ఏ పి ఎం అంజయ్య ఏఈఓ సిసిలు సంఘ బంధం సభ్యులు రైతులు పాల్గొన్నారు.