వీధి కుక్కల స్వైర విహారం 

వీధి కుక్కల స్వైర విహారం 

ఇద్దరు చిన్నారులు సహా నలుగురిఫై దాడి చేసి గాయపరచిన కుక్కులు 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాలలో రోజు రోజుకు వీధి కుక్కల స్వైర విహారం పెరిగిపోతుంది. జగిత్యాల మున్సిపల్ పరిధిలోని టిఆర్ నగర్ లో రాత్రి వీధి కుక్కలు ఇద్దరు చిన్నారులు సహా నలుగురిఫై దాడి చేసి గాయపరచాయి. టిఆర్ నగర్ కు చెందిన షేక్ పటాన్, చరణ్ అనే బాలలు సహాచర స్నేహితులతో కలిసి వారి ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా కుక్కల గుంపు వారి పై ఒక్కసారిగా దాడి చేసి గాయ పరిచాయి. అక్కడే ఉన్న కొందరు కర్రలతో కుక్కలను తరిమివేయడంతో చిన్నారులు తప్పించుకున్నారు. కుక్కలు వెళ్తూ వెళ్తూ దారిలో ఉన్న సలీం అనే వ్యక్తితో పాటు మరో మహిళాఫై దాడి చేసి గాయ పరిచాయి. గాయపడ్డ వారిని జిల్లా కేద్రంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళగా చికిత్స పొందుతున్నారు. నెల రోజుల క్రితం టిఆర్ నగర్ లో ఓ బాలుడిఫై కుక్కలు దాడి చేసి గాయపరచగా, జగిత్యాల పట్టణంలో ఇప్పటివరకు 10 మందికి పైన దాడులు చేశాయి. ఇన్ని సంఘటనలు జరిగిన మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.