రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు విద్యార్థి ఎంపిక

ముద్ర,చొప్పదండి:ఈనెల 5వ తేదీ నుండి గద్వాల్ లో జరిగే రాష్ట్రస్థాయి ఎస్జీఫ్ అండర్-17 బాలుర క్రికెట్ పోటీలో పాల్గొనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు జడ్పిహెచ్ఎస్ బాయ్ చొప్పదండి విద్యార్థి ఎం.సూర్య తేజ ఎంపికయ్యడని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు కొమురోజు కృష్ణ తెలిపారు. నవంబర్ 24న సెంటినరి కాలనీలో  జరిగిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి పోటీల్లో కరీంనగర్ జిల్లా తరఫున పాల్గొని చక్కటి ప్రతిభ కనబరిచి  రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు. ఈసందర్భంగా విద్యార్థి సూర్య తేజను శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ కొమురోజు కృష్ణ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్యుల రాజిరెడ్డి అభినందించారు. ఎంపికైన విద్యార్థి సూర్య తేజను రాష్ట్రస్థాయి పోటీలలో చక్కగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సూర్య తేజ ను పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ ఓరుగంటి మమత, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అభినందించారు.