ఈ నెల 21 న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ...!

ఈ నెల 21 న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ...!

ముద్ర,తెలంగాణ:-ఈ నెల 21 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.