పాపం పండింది.. జైలుకు పోవుడే
![పాపం పండింది.. జైలుకు పోవుడే](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_641839a509588.jpg)
సీఎం సందేశంపై ట్విట్టర్ వేదికగా వైఎస్షర్మిల ఆగ్రహం
ముద్ర తెలంగాణ బ్యూరో: ఎవడు చస్తే నాకేంటని... వెంట నడిచినోళ్ళను. వెన్నంటి ఉన్నోళ్లను వెన్ను పోటు పొడిచావ్ అంటూ ట్విట్టర్ వేదిక ద్వారా వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సోమవారంనాడు పార్టీ శ్రేణులకు ఇచ్చిన సందేశంపై ఆమే నిప్పులు చెరిగారు. సకల జనులను మోసం చేసావ్.. కానీ ఇప్పుడు నీ పీఠం కదులుతుందని,లిక్కర్ మరకల్లో బిడ్డ జైలుకు పోతుందని.. పేపర్ లీకేజి వ్యవహారం అధికార శాపం అయ్యేసరికి పార్టీ శ్రేణులు గుర్తొచ్చారా అంటూ మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయని ఎత్తులు వేస్తున్నావా? అయ్యా కెసిఆర్ గారు..
రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పడు.. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పడు.. ఉద్యమ కారులకు అన్యాయం జరిగినపుడు.. మీ పార్టీ సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకొంటున్నప్పుడు.. ఒక్క నాడైనా ఆత్మహత్యలు చేసుకోకండి అని ఒక్కరికైనా లెటర్ రాసావా? అంటూ ప్రశ్నించారు. బిడ్డజైలు కు పోయే సమయం వచ్చే సరికి కేసీఆర్ కు కార్యకర్తలు గుర్తుకు వచ్చారని, ఇప్పుడు కార్యకర్తల బలం గుర్తుకు వచ్చింది.తెలంగాణ ఉద్యమం గుర్తుకు వచ్చింది.ఆత్మీయ సందేశం అని ..మొసలి కన్నీరు కారుస్తూ ఓపెన్ లెటర్లు రాస్తున్నాడు అంటూ ఆరోపించారు. నువ్వు ఎన్ని లెటర్లు రాసిన .. ఎన్ని కుప్పిగంతులు వేసినా .. నీ పాపం పండింది. రేపు ఎన్నికల్లో నీ పాపానికి పరిహారం చెల్లించుకొనుడే .. నువ్వు నీ ఫ్యామిలీ జైలుకు పోవుడే అంటూ ట్విట్ చేశారు.