టీడీపీలో హ్యాట్రిక్ సాధించిన వీరులు వీరే…

టీడీపీలో హ్యాట్రిక్  సాధించిన వీరులు వీరే…

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో తెలుగుదేశం పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఒంట‌రిగానే 130కి పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించింది. టీడీపీ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద విజ‌యం దిశగా దూసుకెళ్తున్న ఆ పార్టీలో ప‌లువురు నేత‌లు హ్యాట్రిక్ విజ‌యం సాధించారు.ఈ జాబితాలో టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌, గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, నిమ్మ‌ల రామానాయుడు, చిన‌రాజ‌ప్ప‌, అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌, ఏలూరి సాంబ‌శివ‌రావు, గొట్టిపాటి ర‌వి, గ‌ద్దె రామ్మోహ‌న్‌, నంద‌మూరి బాల‌కృష్ణ ఉన్నారు. వీరంద‌రూ హ్యాట్రిక్ గెలుపు రుచి చూశారు.