ఉమ్మడి వరంగల్ జిల్లా గౌడ జేఏసీ వైస్ చైర్మన్ గా వేముల మహేందర్ గౌడ్

ఉమ్మడి వరంగల్ జిల్లా గౌడ జేఏసీ వైస్ చైర్మన్ గా వేముల మహేందర్ గౌడ్

ముద్ర, మొగుళ్లపల్లి :ఉమ్మడి వరంగల్ జిల్లా గౌడ జేఏసి వైస్ చైర్మన్ గా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన వేముల మహేందర్ గౌడ్ నియమితులయ్యారు. గౌడ కుల సంఘాలు పార్టీల వారీగా విడిపోవడంతో అగ్రవర్ణాల పార్టీలు విభజించు పాలించు అనే పద్ధతిలో గౌడ కులస్తులను వాడుకుంటూ.. రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్న సందర్భంలో గౌడ కులస్తులందరిని ఏకతాటిపైకి తేవాలనే సంకల్పంతో గోపా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చిర్ర రాజు గౌడ్, గౌరవ అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గౌడ కుల సంఘాలన్నీ ఒక్కటై హన్మకొండలోని హంటర్ రోడ్ లో గల గౌడ హాస్టల్ భవనంలో సమావేశమై చర్చించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా గౌడ జేఏసీలో గౌడ కుల సంఘాలన్నీ విలీనమయ్యాయి. రాజ్యాధికారమే లక్ష్యంగా ఏర్పడ్డ ఉమ్మడి వరంగల్ జిల్లా  గౌడ జేఏసీలో గౌడ కులస్తులందరూ భాగస్వామ్యమై రానున్న ఎన్నికల్లో బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని పలువురు  వక్తలు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పడ్డ ఉమ్మడి వరంగల్ జిల్లా  గౌడ జేఏసీలో వైస్ చైర్మన్ గా వేముల మహేందర్ గౌడ్ ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన వేముల మహేందర్ గౌడ్ మాట్లాడుతూ..గౌడ కులస్తులు   ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే, గౌడన్నలు రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేలా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తన నియామకానికి కృషిచేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా గౌడ జేఏసీ చైర్మన్ బైరీ రవికృష్ణ గౌడ్, వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, చిర్ర రాజు గౌడ్ లకు మహేందర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.