బీఆర్ఎస్ లో చేరిన వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ

బీఆర్ఎస్ లో చేరిన వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ

ముద్ర ప్రతినిధి ,వికారాబాద్: వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో చేరారు.తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ మరియు ఐటీ శాఖ మాత్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ,వికారాబాద్ జిల్లా, బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ఆది వారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ కామిడి చంద్రకళ కమాల్ రెడ్డి, ఎంపీపీ భర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కమాల్ రెడ్డి, ప్రముక డాక్టర్ భరత్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది కమాల్ రెడ్డి కుమారుడు రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులువిష్ణువర్ధన్ రెడ్డి, దశరథ్ రెడ్డిలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.