వింగ్స్‌ ఇండియా 2024 విమానాల ప్రదర్శన

వింగ్స్‌ ఇండియా 2024  విమానాల ప్రదర్శన

ముద్ర,హైదరాబాద్:- విమాన రంగానికి మరింత ఊతమిచ్చేల నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శనకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం ముస్తాబయ్యింది. ఈ నెల 21 వరకు వింగ్స్ ఇండియా కార్యక్రమం నిర్వహిస్తారు. 4 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన అధునాతన విమానాలు కనువిందు చేస్తున్నాయి. విమానయానానికి ప్రజలను మరింత చేరువ చేయడంతో పాటు ఈ రంగానికి ఉన్న అవకాశాలను వ్యాపారవేత్తలకు, అంకుర పరిశ్రమలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

వింగ్స్ ఇండియా 2024 ఈవెంట్ హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ప్రదర్శన ప్రారంభం అయ్యింది. మంత్రిత్వ శాఖ మరియు ఫిక్కీ సహకారంతో AAI (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ఇతర ఏవియేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.