8 నెలలు అవిశ్రాంతంగా పనిచేయాలి: రేవంత్​ రెడ్డి

రాబోయే 8 నెలల పాటు అవిశ్రాంత పని చేయాలని, ఇది చాలా కీలకమైన సమయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  అన్నారు. గాంధీభవన్ లో పలువురు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా కాంగ్రెస్​ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి., వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, నదీమ్ జావిద్ సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా రేవంత్​ రెడ్డి మాట్లడుతూ  నాయకులు  వారికి కేటాయించిన బాధ్యతలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.  ప్రసార మాధ్యమాలలో మన వాదన బలంగా వినిపించేందుకు ప్రతి నాయకుడు సిద్ధంగా ఉండాలన్నారు. బీజేపీ, బిఆర్ ఎస్ పార్టీ లు  ఎవరి కోసం పని చేస్తున్నాయో ప్రజలకు వివరించాలన్నారు.