8 నెలలు అవిశ్రాంతంగా పనిచేయాలి: రేవంత్ రెడ్డి
రాబోయే 8 నెలల పాటు అవిశ్రాంత పని చేయాలని, ఇది చాలా కీలకమైన సమయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో పలువురు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి., వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, నదీమ్ జావిద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లడుతూ నాయకులు వారికి కేటాయించిన బాధ్యతలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రసార మాధ్యమాలలో మన వాదన బలంగా వినిపించేందుకు ప్రతి నాయకుడు సిద్ధంగా ఉండాలన్నారు. బీజేపీ, బిఆర్ ఎస్ పార్టీ లు ఎవరి కోసం పని చేస్తున్నాయో ప్రజలకు వివరించాలన్నారు.