వైఎస్ షర్మిల జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్కు తరలింపు.. పోలీసులు కేసు నమోదు
వైఎస్ షర్మిలను పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. అంతకుముందు లోటస్పాండ్వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్షర్మిలను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. వారి తీరుపై షర్మిల అసహనం వ్యక్తం చేశారు. ఆమెను టీఎస్పీఎస్సీ ఆఫీసుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
వైఎస్ షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై, మహిళా కానిస్టేబుల్పై షర్మిల దాడి చేశారన్నారు. షర్మిల తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల దాడి చేసిన ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు.