పేదల భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి - వెంకట్ గౌడ్ డిమాండ్

పేదల భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి - వెంకట్ గౌడ్ డిమాండ్

బాన్సువాడ, ముద్ర : నసూర్లబాద్ MRO ఆఫీస్ ముందు మా భూమి మాకు ఇవ్వాలనే డిమాండ్ తో గత 8 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న బాధితులకు మద్దతు గా సోమవారం నాడు CPM పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 8 రోజులుగా తమ భూమిని ఒక అదికార పార్టీ నాయకుడు నలుగురు నిరుపేదలకు సంబంధించిన 3 ఎకరాల భూమి దౌర్జన్యంగా ఆక్రమించుకొని భూమిలోకి వేస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపారు. మరో వైపు రెవెన్యూ అధికారులు సైతం 8 రోజులుగా పట్టించు కోవడం లేదని సిగ్గు మాలిన చర్య అని వెంటనే అధికారులు స్పందించి పేదల భూములను పేదలకు ఇప్పించాలని లేక పోతే జిల్లా కలెక్టర్ గారికి తెలుపుతామని అయిన పరిష్కారం చేయకపోతే ఎమ్మార్వో ఆఫీస్ లో దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో CPM పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ తోపాటు జిల్లా కమిటీ సభ్యులు ఖలీల్, మండల నాయకులు సాయిలు శంకర్ బాధితులకు పాల్గొన్నారు